హైదరాబాద్, ఆగస్టు 28 (నమస్తే తెలంగాణ): పీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి జీవితమంతా బ్లాక్మెయిల్ రాజకీయాలనేనని కార్మికశాఖ మంత్రి మల్లారెడ్డి విమర్శించారు. తమను ఇష్టమొచ్చినట్టు తిడితే తోలు తీస్తామని హెచ్చరించారు. ఎల్లకాలం బ్లాక్మెయిల్ రాజకీయాలు చేస్తానంటే కుదరదని స్పష్టంచేశారు. అబద్ధ్దాలు, బెదిరింపులతో రేవంత్ కోట్లకు కోట్లు సంపాదించారని ఆరోపించారు. ఎంపీ పదవికి రాజీనామా చేసి మళ్లీ పోటీచేసి గెలువాలని తాను విసిరిన సవాల్ను స్వీకరించకుండా పారిపోయిన రేవంత్కు తన గురించి మాట్లాడే నైతిక హక్కులేదని తేల్చిచెప్పారు. శనివారం టీఆర్ఎస్ ఎల్పీ కార్యాలయంలో ఎమ్మెల్సీ శంభీపూర్రాజు, ఎమ్మెల్యే కేపీ వివేకానందతో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. రేవంత్రెడ్డి తన కాలేజీలపై అసత్య ఆరోపణలు, అబద్ధ్దాలు ప్రచారం చేశారని మండిపడ్డారు.
కష్టపడి సంపాదించుకున్న..
తాను పాలు అమ్మి, బోర్లు వేసి, చిట్టీలు నడిపి, కాలేజీలు పెట్టి ఆస్తులు సంపాదించానని మంత్రి మల్లారెడ్డి పునరుద్ఘాటించారు. రేవంత్రెడ్డి ఏం చేసి కోట్లకు కోట్లు సంపాదించారని నిలదీశారు. జవహర్నగర్లో తాను ప్ర భుత్వ భూమిని కబ్జా పెట్టలేదని స్పష్టంచేశారు. దమ్ముం టే రేవంత్రెడ్డి చేసిన ఆరోపణలను నిరూపించాలని సవాల్ విసిరారు. జవహర్నగర్లో దశాబ్దాలుగా పేదలు ఇండ్లు కట్టుకొని జీవిస్తుంటే 330 ఎకరాల ప్రభుత్వ భూమిని సీఎం కేసీఆర్ పెద్దమనసుతో 2016లో ఇండ్లు కట్టుకొన్నవారికి క్రమబద్ధీకరించారని గుర్తుచేశారు. రేవంత్ ఆరోపిస్తున్నట్టుగా అక్కడ తన కోడలు పేరిట ఐదెకరా లు లేదని, 350 చదరపు గజాల స్థలమే ఉన్నదని చెప్పా రు. దానికి బాజాప్తాగా కాగితాలున్నాయని, మున్సిపల్ కార్పొరేషన్ నుంచి నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ ఉన్నదని తెలిపారు. రేవంత్ బట్టకాల్చి మీదేసే రకమని మండిపడ్డారు.
బ్లాక్మెయిల్ రేవంత్
రేవంత్ ఆర్టీఐ చట్టాన్ని అడ్డుపెట్టుకొని ఎంతోమందిని బ్లాక్మెయిల్ చేశారని మంత్రి మల్లారెడ్డి ధ్వజమెత్తారు. 130 ఏండ్ల కాంగ్రెస్ పార్టీకి రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న ఆయన దిగజారుడు రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. అబద్ధాలు ఆపకపోతే ఊరుకునే ప్రసక్తేలేదని తేల్చిచెప్పారు. మల్లారెడ్డి ఇంజినీరింగ్, మెడికల్ కాలేజీలకు కేంద్ర విద్యాశాఖ శాఖమంత్రి లిఖితపూర్వకంగా క్లీన్చిట్ ఇచ్చారని చెప్పారు. రేవంత్ బ్లాక్మెయిల్కు పాల్పడుతూ ఆదిలాబాద్, మహేశ్వరం, మూడుచింతలపల్లి ప్రాంతాల్లో సభ లు పెట్టి బలవంతంగా డబ్బు వసూలు చేశారని ఆరోపించారు. మూడుచింతలపల్లిలో ఓ దుర్మార్గుడు తన ఇంట్లో బస చేశారని దళిత కుటుంబం శుద్ధిచేసుకొని రేవంత్రెడ్డి శవయాత్ర నిర్వహించారని తెలిపారు. తనకు 600 ఎకరాల భూమి ఉన్నదని గతంలోనే చెప్పానని, అందులో 400 ఎకరాల్లో కాలేజీలున్నాయని చెప్పారు. మిగతా 200 ఎకరాలు తమ ఉమ్మడి కుటుంబ ఆస్తి అని, అన్నదమ్ములు, కొడుకులు, కోడండ్లు అందరికీ ఒక్కొక్కరికి 15-20 ఎకరాలు ఉన్నదని వివరించారు. తాను ఏడాది కి రూ.2.5 కోట్లు పన్ను కడుతున్నానని వెల్లడించారు. తన బావమరుదులు ప్రభుత్వ భూమిని కబ్జా చేశారన్న రేవంత్ ఆరోపణలను మంత్రి ఖండించారు. రేవంత్ చెప్పిన సర్వే నంబర్లతో తనవారికి సంబంధంలేదని తేల్చిచెప్పారు. తాను ఎంపీగా ఉన్నప్పటినుంచే రేవంత్ తనను బ్లాక్మెయిల్ చేస్తూ చిత్రవధ చేయటం ప్రారంభించారని మల్లారెడ్డి తెలిపారు. ‘రేవంత్.. పొద్దున లేస్తే అబద్ధాలు చెప్తూ తిరగడం కాదు.. దమ్ముంటే హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్కు డిపాజిట్ తెచ్చుకో’ అని మరో సవాల్ విసిరారు.