నాగర్కర్నూల్ : ఓటమి భయంతో అసహనానికి లోనవుతున్న టీపీసీసీ చీఫ్ (TPCC Chief) రేవంత్ రెడ్డి మరోసారి అహంకారం ప్రదర్శించారు. మంగళవారం నాగర్కర్నూల్ నియోజకవర్గంలోని బిజినపల్లి సభలో ముస్లింలను అవమానించారు.
సభలో మైనార్టీ నేత ఇమమే జమీన్ కడుతుంటే వద్దని వారించారు. జమీన్ కడుతుండగా వద్దని చీదరించుకుంటూ కట్టకుండా దాన్ని తీసేసుకోవడంతో మైనారిటీ నేతలు విస్తుపోయారు. వేదికపై రేవంత్ రెడ్డి దురుసు ప్రవర్తనతో అక్కడున్న వారంతా ఆశ్చర్యపోయారు. ముస్లిం, మైనారిటీల పట్ల పీసీసీ అధ్యక్షుడు దురహకారంగా వ్యవహరించడంతో సభికులు సైతం కంగుతిన్నారు.
అధికారంలోకి వచ్చేస్తున్నామని పగటి కలలు కంటున్న కాంగ్రెస్ నేతలు ఇప్పుడే దురుసుగా వ్యవహరిస్తుండటంతో పొరపాటున పదవిలోకి వస్తే వీరు సామాన్యులపై ఏ స్ధాయిలో వీరంగం వేస్తారోనని ప్రజలు చర్చించుకుంటున్నారు.
Read More :