వినాయకనగర్, ఫిబ్రవరి 8: నకిలీ కుల ధ్రువీకరణ పత్రంతో ఓ వ్యక్తి జాబ్లో చేరాడు. 40 ఏండ్లు దర్జాగా ఉద్యోగంలో కొనసాగాడు. తీరా.. ఉద్యోగ విరమణ సమయం లో ఆయన ఫేక్ భాగోతం గురు వారం వెలుగుచూసింది. నిజామా బాద్ జిల్లా బోర్గం(పీ)కి చెందిన ఎం చంద్రశేఖర్ బీసీ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి.
అయితే.. 1983లో తాను ఎస్సీ సామాజిక వర్గానికి చెందినట్టు నకిలీ సర్టిఫి కెట్ సృష్టించి ఎస్సీ కోటాలో ఆర్టీ సీలో ఉద్యోగం పొందాడు. కండక్ట ర్ జాబ్లో చేరి.. 40 ఏండ్ల సర్వీ సులో ప్రమోషన్లు పొందుతూ అసిస్టెంట్ డిపో క్లర్క్ (ఏడీసీ) స్థా యికి ఎదిగాడు. ఇటీవలే ఉద్యోగ విరమణ పొందిన చంద్రశేఖర్.. రిటైర్మెంట్ బెనిఫిట్స్ కోసం సమర్పించిన కుల ధ్రువీకరణ సర్టిఫికెట్ నకిలీదని తేలింది.