హైదరాబాద్, అక్టోబర్ 1 (నమస్తే తెలంగాణ ): రాష్ట్రంలోని పెన్షనర్ల సమస్యలను పరిష్కరించాలని తెలంగాణ రిటైర్డ్ గెజిటెడ్ అధికారుల సంఘం కోరింది. శుక్రవారం సంఘం నేతలు ఎక్సైజ్శాఖ మంత్రి వీ శ్రీనివాస్గౌడ్ను రవీంద్రభారతిలోని తన కార్యాలయంలో కలిసి వినతిపత్రం సమర్పించారు. పెన్షనర్ల బకాయిలు, పరిమితిలేని నగదురహిత ఆరోగ్యపథకం, ప్రత్యేక డైరెక్టరేట్ ఏర్పాటు, డీఏ మంజూరు తదితర సమస్యలను పరిష్కరించాలని కోరారు. కార్యక్రమంలో సంఘం నేతలు మోహన్నారాయణ, నర్సరాజు, జే రవీందర్, యాదయ్యగౌడ్, కే బ్రహ్మానందం, కే దశరథరావు, జీ విష్ణువర్ధన్రావు, పుట్ట పాండురంగయ్య, సీహెచ్ చంద్రమౌళి, శ్రీనివాసాచారి తదితరులు పాల్గొన్నారు.