హైదరాబాద్ :టీఆర్ఎస్లోకి వలసల పర్వం కొనసాగుతూనే ఉంది. రాష్ర్టంలో జరుగుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు ఆకర్షితులై వివిధ పార్టీ నుంచి టీఆర్ఎస్లో చేరుతున్నారు.
తాజాగా నిజామాబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గం చౌటపల్లి గ్రామానికి చెందిన పుప్పాల నిరంజన్తో పాటు పలువురు యువకులు రోడ్లు-భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి సమక్షంలో టీఆర్ఎస్ పార్టీలో చేరారు.
మంగళవారం వారికి హైదరాబాద్లోని మంత్రి నివాసంలో గులాబీ కండువా కప్పిపార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ..ముఖ్యమంత్రి కేసీఆర్ జనరంజకపాలన యువతలో స్ఫూర్తి నింపుతుందని మంత్రి పేర్కొన్నారు.
బాధ్యతగల యువత ఎప్పుడూ టీఆర్ఎస్ వెంటే అని మంత్రి ఈ సందర్భంగా తెలిపారు. టీఆర్ఎస్లోనే పార్టీ కార్యకర్తలకు సరైన గుర్తింపు లభిస్తుందన్నారు. పార్టీలో చేరిన ప్రతి ఒక్కరిని కంటికి రెప్పలా చూసుకుంటామన్నారు.