హైదరాబాద్, జనవరి 13(నమస్తే తెలంగాణ): రాష్ట్ర పెట్టుబడుల ప్రమోషన్ ప్రత్యేక కార్యదర్శిగా ఉన్న ఐఎఫ్ఎస్ అధికారి ఈ విష్ణువర్ధన్రెడ్డికి టీఎస్ఐఐసీ వైస్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా పూర్తిస్థాయి అదనపు బాధ్యతలు అప్పగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది.
ఇటీవల ఐఏఎస్ అధికారుల బదిలీల సందర్భంగా టీఎస్ఐఐసీ వీసీ, ఎండీ నర్సింహారెడ్డిని గిరిజన సంక్షేమ శాఖకు బదిలీచేసి ఈ శ్రీధర్కు అదనపు బాధ్యతలు అప్పగించిన విషయం విధితమే. తాజాగా శ్రీధర్ స్థానంలో విష్ణువర్ధన్ రెడ్డికి అదనపు బాధ్యతలు అప్పగించారు.