ఖైరతాబాద్, సెప్టెంబర్ 11: రైస్మిల్లర్ల సమస్యలు పరిష్కరించాలని తెలంగాణ రైస్మిల్లర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ డిమాండ్ చేసింది. లేనిపక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మిల్లులను నిరవధికంగా బంద్ పెడ్తామని హెచ్చరించింది. మిల్లర్ల సమస్యలు పరిషరించకుండా ప్రభుత్వ విభాగాలతో ఆకస్మిక దాడు లు చేయడం సరికాదని పేర్కొన్నది. శుక్రవా రం సోమాజిగూడ ప్రెస్క్లబ్లో తెలంగాణ ఉద్యమకారుడు రఫీతో కలిసి ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో రాష్ట్ర రైస్మిల్లర్ల సంక్షేమ సంఘం అధ్యక్షుడు పాడి గణపతిరెడ్డి మాట్లాడుతూ.. ప్రస్తుతం రైస్మిల్లర్ రంగం అనేక సమస్యలు ఎదురొంటున్నదని వివరించారు.
రైతుల నుంచి ధాన్యం సేకరణ మొదలు, ప్రభుత్వానికి రైస్ అందించే వరకూ మిల్లర్లు కీలకపాత్ర పోషిస్తున్నారని, ఈ రంగంపై ఆధారపడిన కార్మికులు, ఇతరవర్గాల ఉపాధిని దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం నిర్ణయాలు తీసుకోవాలని కోరారు. ఎన్ఫోర్స్మెంట్, టాస్ఫోర్స్ విభాగాల ఆధ్వర్యంలో రైస్మిల్లులపై ఆకస్మిక దాడులు నిలిపివేయాలని డిమాండ్ చేశారు. కష్టమ్ మిల్లింగ్ రైస్(సీఎంఆర్) అగ్రిమెంట్ను ప్రభుత్వం ఇరువర్గాలకు ఆమోదయోగ్యంగా ఉండేలా రూపొందించాలని కోరారు.ప్రభుత్వం రైస్ మిల్లర్ల ప్రతినిధులతో చర్చలు జరుపాలని కోరారు.