హైదరాబాద్, ఫిబ్రవరి 24 (నమస్తే తెలంగాణ): ధరణి పెండింగ్ దరఖాస్తులను వెంటనే పరిషరించాలని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి రెవెన్యూశాఖ అధికారులను ఆదేశించారు. మార్చి మొదటి వారంలో అన్ని తహసీల్దార్ కార్యాలయాల్లో పెండింగ్ దరఖాస్తులను పరిష్కరించే కార్యక్రమం చేపట్టాలని సూచించారు. శనివారం సచివాలయంలో ధరణి కమిటీతో సీఎం సమీక్ష నిర్వహించారు. కమిటీ ఇచ్చే తుది నివేదిక ఆధారంగా శాశ్వత పరిషారానికి నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. లోపాలను సవరించేందుకు చట్ట సవరణ చేయటం, కొత్త ఆర్వోఆర్ చట్టం చేయటం తప్ప గత్యంతరం లేదని కమిటీ సభ్యులు సీఎంకు నివేదించారు. 2020లో అమల్లోకి వచ్చిన ఆర్వోఆర్ చట్టంలో అనేక లోపాలున్నాయని ధరణి కమిటీ సీఎంకు నివేదించింది.
ఏజెన్సీపై విచారణ
ధరణి పోర్టల్ నిర్వహిస్తున్న ఏజెన్సీపై సమగ్ర విచారణ జరిపించాలని సీఎం రేవంత్రెడ్డి ఆదేశించారు. సీసీఎల్ఏ అధ్వర్యంలో నిర్వహించాల్సిన ఈ పోర్టల్ను ప్రైవేటు ఏజెన్సీకి ఎందుకు అప్పగించారని ప్రశ్నించారు. భూముల రికార్డుల డాటాకు భద్రత ఉన్నదా? సురక్షితంగా ఉన్నట్టా? లేనట్టా? అని అనుమానం వ్యక్తంచేశారు. సమావేశంలో రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, ధరణి కమిటీ సభ్యులు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.