హైదరాబాద్ సిటీబ్యూరో, జనవరి 19 ( నమస్తే తెలంగాణ ): ఎన్నికల సమయంలో కరెంట్ బిల్లులు తామే కడతామని చెప్పిన రేవంత్రెడ్డి.. అధికారంలోకి వచ్చాక పట్టించుకోవడం లేదని నాగోల్ ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేశారు. 200 యూనిట్ల కరెంట్ బిల్లు మాఫీ చేస్తామన్న హామీ అమలు కావడం లేదని విమర్శించారు. తమ కరెంట్ బిల్లులు చెల్లించాలని కోరుతూ నాగోల్లోని పోస్టాఫీస్ నుంచి శుక్రవారం సోనియాగాంధీ ఇంటికి పోస్టుకార్డులు పంపించారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డాక రెండుసార్లు కరెంట్ బిల్లులు చెల్లించామని ఆ లెటర్లో పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న బీఆర్ఎస్ సోషల్ మీడియా కన్వీనర్ వై సతీశ్ రెడ్డి మాట్లాడుతూ.. కాంగ్రెస్ హామీ నెరవేర్చకపోతే లక్షల్లో ఉత్తరాలు పంపిస్తామని హెచ్చరించారు.