హైదరాబాద్, మే 4 (నమస్తే తెలంగాణ) : కేంద్రప్రభుత్వ రంగ సంస్థ అయిన అసోసియేషన్ ఆఫ్ స్టేట్ రోడ్ ట్రాన్స్పోర్ట్ అండర్ టేకింగ్స్ (ఏఎస్ఆర్టీయూ) ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ టీ సూర్యకిరణ్కు డాక్టరేట్ లభించింది. ‘మారెట్ ధోరణి-టీఎస్ ఆర్టీసీ ఉద్యోగుల పనితీరు’ అంశంపై చేసిన పరిశోధనకు బుధవారం వరంగల్ నిట్ డాక్టరేట్ను అందించింది. నిట్ మేనేజ్మెంట్ విభాగం అసోసియేట్ ఫ్రొఫెసర్ ఫ్రాన్సిస్ సుధాకర్ పర్యవేక్షణలో ఈ పరిశోధనను సూర్యకిరణ్ పూర్తి చేశారు.
1992లో ఆర్టీసీలో చేరిన ఆయన ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో డీఎం, డీవీఎం, ఆర్ఎం తదితర హోదాల్లో పనిచేశారు. టీఎస్ఆర్టీసీ చీఫ్ పర్సనల్ మేనేజర్ (సీపీఎం)గా విధులు నిర్వర్తించారు. ప్రస్తుతం డిప్యూటేషన్పై న్యూఢిల్లీలోని ఏఎస్ఆర్టీయూ ఈడీతో పాటు సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రోడ్ ట్రాన్స్ పోర్ట్ (సీఐఆర్టీ) డైరెక్టర్గా పనిచేస్తున్నారు. గురువారం హైదరాబాద్లోని బస్భవన్లో టీఎస్ఆర్టీసీ ఎండీ సజ్జనార్ను సూర్యకిరణ్ మర్యాదపూర్వకంగా కలువగా, అభినందించారు.