సీఎస్కు అసోసియేషన్ వినతి
హైదరాబాద్, సెప్టెంబర్ 3 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో ఖాళీగా ఉన్న స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్లు, డిప్యూటీ కలెక్టర్ల పోస్టులను వెంటనే భర్తీ చేయాలని డిప్యూటీ కలెక్టర్ల అసోసియేషన్ ప్రభుత్వాన్ని కోరింది. ఈ మేరకు అసోసియేషన్ ప్రతినిధులు శుక్రవారం బీఆర్కే భవన్లో సీఎస్ సోమేశ్కుమార్కు వినతిపత్రం అందజేశారు. వెయిటింగ్లో ఉన్న డిప్యూటీ, స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్లకు సరైన పోస్టింగ్, ఎస్సీఎస్ కోటాలో అర్హులైన డిప్యూటీ కలెక్టర్లను ఐఏఎస్లుగా కన్ఫర్మేషన్ ఇవ్వాలని విజ్ఞప్తిచేశారు. రైతులకు మేలు చేసేలా రెవెన్యూశాఖలో విప్లవాత్మక మార్పులు తీసుకురావడం, ఉద్యోగులకు పీఆర్సీ అమలు చేయడంపై సంతో షం వ్యక్తంచేశారు. సీఎస్ను కలిసినవారిలో అసోసియేషన్ అధ్యక్షుడు చంద్రమోహన్, జనరల్ సెక్రటరీ శ్రీనివాస్రెడ్డి, ట్రెజరర్ భాస్కర్రావు ఉన్నారు.