హైదరాబాద్, సెప్టెంబర్ 25 (నమస్తే తెలంగాణ): ధరణి సమస్యలపై ప్రభుత్వం ఏర్పాటుచేసిన క్యాబినెట్ సబ్కమిటీ త్వరలో భేటీ కానున్నది. ఈ నేపథ్యంలో కలెక్టర్లు క్షేత్రస్థాయిలోని సమస్యలపై సమగ్ర నివేదిక సిద్ధం చేసినట్టు సమాచారం. రైతులు ఏయే అంశాల్లో ఇబ్బందులు పడుతున్నారో తాసిల్దార్లు గుర్తించి, వివరాలు తెలుపాలని వారు ఆదేశించినట్టు తెలిసింది. దీంతో అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించి సమస్యలను నివేదిక రూపంలో అందజేయగా, కలెక్టర్లు వాటిని క్రోడీకరించినట్టు తెలుస్తున్నది. అంతిమంగా 18-20 సమస్యలు ఉన్నట్టు తేలింది. ఈ నివేదికను త్వరలో క్యాబినెట్ సబ్కమిటీకి గానీ, దానికి ముందు నిర్వహించే సన్నాహక సమావేశంలోగానీ ఉన్నతాధికారులకు అందజేయాలని కలెక్టర్లు భావిస్తున్నారు.
కలెక్టర్ల నివేదికలోని కొన్ని అంశాలు