Telangana | హైదరాబాద్ : పంచాయతీరాజ్ శాఖ పునర్ వ్యవస్థీకరణకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కొత్తగా 4 చీఫ్ ఇంజినీర్, 12 సర్కిల్ ఇంజినీర్, 11 డివిజన్ ఇంజినీర్, 60 సబ్ డివిజన్ ఇంజినీర్ పోస్టులను మంజూరు చేసింది ప్రభుత్వం. వివిధ స్థాయిల్లో ఇంజినీర్లకు పనులు మంజూరు చేసే అధికారం కల్పించింది. డీఈఈకి ఏడాదికి రూ. 5 లక్షలు, ఈఈకి ఏడాదికి రూ. 25 లక్షల వరకు అనుమతి ఇచ్చింది.