TSPSC | హైదరాబాద్ : టీఎస్పీఎస్సీ పేపర్ లీక్ కేసులో ఇద్దరు ఉద్యోగులపై వేటు పడింది. నిందితురాలు రేణుక( Renuka ), ఆమె భర్త డాక్యా నాయక్( Dakya Naik )లను ఉద్యోగాల నుంచి తొలగించారు. వనపర్తి జిల్లా( Wnaparthy ) గురుకుల పాఠశాలలో రేణుక హిందీ టీచర్గా పని చేస్తుంది. డాక్యానాయక్ వికారాబాద్ జిల్లా( Vikarabad Dist ) కుల్కచర్లలో ఉపాధిహామీ టెక్నికల్ అసిస్టెంట్గా పని చేస్తున్నాడు. వీరిద్దరిని విధుల నుంచి తాత్కాలికంగా సస్పెండ్ చేస్తున్నట్లు ఉత్తర్వులు జారీ అయ్యాయి. చంచల్గూడ మహిళా జైల్లో రేణుక ఉంటున్న విషయం తెలిసిందే. డాక్యానాయక్ కూడా చంచల్గూడ( Chanchalguda ) జైల్లోనే ఉన్నాడు. పేపర్ లీక్ కేసులో ఏ3గా రేణుక, ఏ4గా డాక్యా నాయక్ పేర్లను పోలీసుల చేర్చారు.
టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ వ్యవహారంలో నిందితుల నుంచి సిట్ అధికారులు( SIT Team ) కీలక సమాచారాన్ని రాబడుతున్న విషయం తెలిసిందే. ప్రధాన నిందితులైన ప్రవీణ్కుమార్( Praveen Kumar ), రాజశేఖర్రెడ్డి( Rajashekar Reddy ) గ్రూప్-1 పేపర్( Group-1 Paper ) కోసం జూన్ నుంచే ప్రయత్నాలు మొదలు పెట్టి, అక్టోబర్ మొదటి వారంలో పేపర్ను అపహరించినట్టు విచారణలో వెల్లడించినట్టు తెలిసింది. పేపర్ లీకేజీ ఘటనలో 9 మంది నిందితులను మూడో రోజు సిట్ అధికారులు విచారించి, పలు ప్రశ్నలపై సమాధానాలు రాబట్టారు. మొదటి రెండు రోజులు ఒక్కొక్కరిని, ఇద్దరిద్దరిని కలిపి విచారించిన సిట్, మూడో రోజు కొద్ది సేపు అందరినీ కలిపి విచారించింది. ప్రధాన నిందితుల నుంచి రేణుక, డాక్యా దంపతులకు పేపర్ అందిన తరువాత ఆమె సోదరుడైన రాజేశ్వర్ ద్వారా కానిస్టేబుల్ శ్రీనివాస్ను ఎప్పుడు సంప్రదించారు? శ్రీనివాస్ ద్వారా గోపాల్నాయక్, నీలేశ్నాయక్లకు ప్రశ్నాపత్రం ఎప్పుడు అందించారు? వారిద్దరిని పరీక్ష కోసం ఎక్కడ సిద్ధం చేశారు? అనే విషయాలపై నిందితులను ఉమ్మడిగా విచారించారు.