హైదరాబాద్, ఫిబ్రవరి 21 (నమస్తే తెలంగాణ): సూర్యాపేట జిల్లాకు చెందిన పేరిణి నృత్య కళాకారుడు ధరావత్ రాజ్కుమార్ నాయక్ను సాంస్కృతిక, ఆబ్కారీ శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ మంగళవారం తన కార్యాలయంలో అభినందించారు. కేంద్ర సాంస్కృతిక శాఖ – కేంద్ర సంగీత నాటక అకాడమీ ‘ఉస్తాద్ బిస్మిల్లా ఖాన్ యువ పురసార్-2022’ను ఈ నెల 15న ఢిల్లీలో రాజ్కుమార్కు అందజేసింది. కేంద్ర ప్రభుత్వ పురసారం అందుకొన్న తొలి పేరిణి నాట్య కళాకారుడు రాజ్కుమార్ నాయక్ కావడం గర్వకారణమని ఈ సందర్భంగా మంత్రి పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సాయికుమార్, సంతోష్కుమార్, బింగి భరత్గౌడ్ తదితరులు పాల్గొన్నారు.