నాంపల్లి కోర్టులు, మే 24 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలోని న్యాయవాదుల ఆరోగ్యబీమా కార్డులను 2023-24 సంవత్సరానికి పునరుద్ధరించనున్నట్టు న్యాయవాదుల సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యదర్శి మన్నాన్ ఫారూఖీ ఓ ప్రకటనలో తెలిపారు. సీఎం కేసీఆర్ న్యాయవాదుల కోసం రూ.100 కోట్ల బడ్జెట్ను కేటాయించారని, దానికి వచ్చే వడ్డీలో నుంచి న్యాయవాదుల ఆరోగ్యబీమా ప్రీమియంగా చెల్లించనున్నట్టు పేర్కొన్నారు. న్యాయవాదితో పాటు అతడి భార్య, పిల్లలకు ఈ బీమా సౌకర్యం అందుతున్నదని తెలిపారు. నిరుడు ఆరోగ్యబీమా కార్డులు పొందినవారి వివరాలతో పాటు, న్యాయవాదుల జాబితాను ఈ నెల 29వ తేదీలోపు పంపాలని తెలంగాణలోని అన్ని బార్ అసోసియేషన్ కమిటీలకు ఆయన సూచించారు.