హైదరాబాద్, మే 17(నమస్తే తెలంగాణ) : ఇంటర్మీడియట్ మూల్యాంకన అధికారులు, అధ్యాపకులు, సిబ్బందికి పారితోషికాన్ని పెంచడం పట్ల ఇంటర్ విద్య జేఏసీ హర్షం వ్యక్తం చేసింది.
ఒక్కో జవాబు పత్రం మూల్యాంకనానికి రూ.18.93 నుంచి రూ.23.66, మిగిలిన ప్రక్రియలకు రూ.641 నుంచి రూ.800 వరకు పెంచిన సీఎం కేసీఆర్, విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, కార్యదర్శి సందీప్ కుమా ర్ సుల్తానియాకు ధన్యవాదాలు తెలిపింది.