నంగునూరు, అక్టోబర్ 28: సిద్దిపేట జిల్లా నంగునూరు మండల కేంద్రంలో సుమారు రెండు వేల ఏండ్లనాటి చిలుంగొట్టం (సొంగ) అవశేషాలు దొరికినట్టు కొత్త తెలంగాణ చరిత్ర బృందం కన్వీనర్ శ్రీరామోజు హరగోపాల్, సభ్యుడు కొలిపాక శ్రీనివాస్ గురువారం ఓ సంయుక్త ప్రకటనలో తెలిపారు. ఈ వస్తువును నాడు ప్రజ లు పొగ తాగడానికి వాడేవారని వారు పేర్కొన్నారు. ఈ వస్తువు కొలతలు 5 సెంటీమీటర్ల పొడవు, సెంటీమీటర్ మందం, పైభాగం 3 సెంటీమీటర్ల వెడల్పు ఉన్నదని తెలిపారు. గొప్ప మానవ వికాసం జరిగిన ప్రదేశమని చెప్పడానికి ఇదో నిదర్శనమని వారు పేర్కొన్నారు. గతంలో ఇక్కడ అనేక పురాతన వస్తువులు లభించాయన్నారు.