హైదరాబాద్, నవంబర్ 8 (నమస్తే తెలంగాణ): ‘మతం పేరుతో రెచ్చగొట్టడం, ప్రజలను విభజించడం, ఘర్షణ వాతావరణంతో లబ్ధి పొందాలన్న వ్యూహాలు దక్షిణాది రాష్ర్టాల్లో పనిచేయవు. అందుకే దక్షిణాది నుంచి ప్రజాకర్షణ కలిగిన, బలమైన, యువ నేతలను తయారు చేయలేకపోతున్నాం.
దక్షిణాది, ఉత్తరాదిలలో సామాజిక పరిస్థితులు, చారిత్రక నేపథ్యం భిన్నమైనవి. బీజేపీ అధిష్ఠానం వెంటనే గుర్తించి, ఇలాంటి వాటిని ఉత్తరాదికే పరిమితం చేయాలి’ అని కుండబద్దలు కొట్టారు బీజేపీ ప్రధాన అధికార ప్రతినిధి కృష్ణసాగర్రావు. దక్షిణాదిలో గెలవాలంటే బీజేపీ మూలసూత్రాల్లోకి వెళ్లాలని, పార్టీ స్థాపించినప్పటి సిద్ధాంతాలను ప్రచారంలోకి తేవాలన్నారు. తెలంగాణలో తాము బలపడటానికి కాంగ్రెస్ అడ్డంకిగా ఉన్నదని, తమ పార్టీ పట్టణ ప్రాంతాలకే పరిమితమైందని ఆయన ఓ జాతీయ మీడియాతో వ్యాఖ్యానించారు.