హైదరాబాద్, మార్చి 4 (నమస్తే తెలంగాణ): స్కూల్ కాంప్లెక్స్, ఎంఆర్సీ పెండింగ్ గ్రాంట్స్ను విడుదల చేయాలని ప్రభుత్వ గెజిటెడ్ హెచ్ఎం అసోసియేషన్ ప్రభుత్వాన్ని కోరింది. హైదరాబాద్ శ్రీనగర్కాలనీలోని మంత్రి క్యాంపు కార్యాలయంలో శనివారం విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డికి వినతిపత్రాన్ని సమర్పించింది. కార్యక్రమంలో అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు రాజభాను చంద్రప్రకాశ్, రాజగంగారెడ్డి పాల్గొన్నారు.