జోగుళాంబ గద్వాల జిల్లా ధరూరు మండలంలోని రేవులపల్లి గ్రామంలో ఉన్న జూరాల ప్రాజెక్టు కుడి కాల్వకు బుధవారం గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్రెడ్డి నీటిని విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పక్కనే నదులు పారుతున్నా ఉమ్మడి పాలనలో చుక్కనీటికి కూడా నోచుకోలేదని అన్నారు.
స్వరాష్ట్రంలో నేడు రెండు పంటలకు పుష్కలంగా సాగునీరందుతుందని తెలిపారు.
– ధరూరు