సంగారెడ్డి : సంగారెడ్డి(Sangareddy) జిల్లాలోని సింగూరు ప్రాజెక్టు(Singuru project) నుంచి మంజీరా బ్యారేజీ(Manjira barrage)కి నీటిని(water) అధికారులు శుక్రవారం విడుదల చేశారు. ఘనపూర్ ఆయకట్ట కోసం 2,667 క్యూసెక్కులను దిగువకు విడుదల చేశారు. కాగా, సింగూరు ప్రాజెక్ట్లో జల విద్యుత్(Hydroelectricity) ఉత్పత్తి ప్రారంభమైంది. నీటి విడుదలపై రైతులు హర్షం వ్యక్తం చేశారు. యాసంగి పంటలకు ఇబ్బంది ఉండదని ధీమా వ్యక్తం చేశారు.