హైదరాబాద్, మార్చి 28 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర వైద్యారోగ్యశాఖలో 1,442 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల ప్రాథమిక మెరిట్ జాబితాను మంగళవారం విడుదలైంది. దీనిపై అభ్యంతరాలను ఏప్రిల్ 1వరకు తెలియజేయాలని మెడికల్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డు సూచించింది. మెరిట్ జాబితాను బోర్డు వెబ్సైట్లో అందుబాటులో ఉంచింది. అభ్యంతరాలను దరఖాస్తుదారు లాగిన్ నుంచి మాత్రమే ఆన్లైన్లో స్వీకరిస్తామని బోర్డు స్పష్టం చేసింది. కొత్త మెడికల్ కాలేజీల్లో అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి గతేడాది డిసెంబర్ 6న నోటిఫికేషన్ విడుదల చేసిన విషయం తెలిసిందే.