హైదరాబాద్, ఫిబ్రవరి 16 (నమస్తే తెలంగాణ): ప్రభుత్వ బడుల రూపురేఖలు మార్చేందుకు ప్రభుత్వం చేపట్టిన ‘మన ఊరు మన బడి – మన బస్తీ మన బడి’ కార్యక్రమానికి తొలి విడత స్కూళ్ల ఎంపిక పూర్తయ్యి ంది. 2021-22 విద్యాసంవత్సరానికి గాను మొత్తంగా 9,123 పాఠశాలల ను ఎంపిక చేశారు. ఇందులో 5,399 ప్రాథమిక, 1,009 ప్రాథమికోన్నత, 2,715 ఉన్నత పాఠశాలలు ఉన్నా యి. మండలం యూనిట్గా అత్యధికంగా విద్యార్థులున్న స్కూళ్లను ఎంపికచేశారు. ఇందులో అత్యధికంగా నల్లగొండ జిల్లాలో 517 స్కూళ్లు ఉండగా, ఆ తర్వాత రంగారెడ్డిలో 464, సంగారెడ్డిలో 441 స్కూళ్లు ఉన్నాయి. స్కూ ళ్ల జాబితాను విద్యాశాఖ అధికారులు ఇటీవలే అన్ని జిల్లాల కలెక్టర్లకు పం పించారు. 15 రోజుల్లో పాఠశాలల వారీగా ప్రతిపాదనలు సిద్ధం చేయాల ని ఆదేశాలు జారీచేశారు. ఇంజినీరింగ్ విభాగం అధికారులు మొత్తం 12 అం శాలకు సంబంధించిన అంచనాలు, బడ్జెట్కు సంబంధించిన ప్రతిపాదనలు రూపొందించి కలెక్టర్లకు సమర్పిస్తారు. ఆ ప్రతిపాదనలకు కలెక్టర్లు పరిపాలనాపరమైన ఆమోదం తెలుపగానే పనులు మొదలుపెడతారు.
మూడు రకాల సమావేశాలు..
ఈ పథకం అమలులో అందరినీ భాగస్వాములను చేసేందుకు మంత్రు లు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీ లు, స్థానిక ప్రజాప్రతినిధులతో మొ త్తం మూడురకాల సమావేశాలు నిర్వహించాలని ప్రభుత్వం సూచించింది. బుధవారం వనపర్తి జిల్లాలో మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు.
తొలి విడత ఎంపిక చేసిన స్కూళ్లు