హైదరాబాద్ : ఇంటర్ వార్షిక పరీక్షలు ఈ ఏడాది ఏప్రిల్లో నిర్వహించనున్నట్లు తెలంగాణ ఇంటర్ బోర్డు ప్రకటించింది. అయితే త్వరలోనే పూర్తి షెడ్యూల్ విడుదల చేయనుండగా, ప్రస్తుతానికి పరీక్ష ఫీజు చెల్లింపు షెడ్యూల్ను ఇంటర్బోర్డు కార్యదర్శి సయ్యద్ ఉమర్ జలీల్ మంగళవారం అధికారికంగా ప్రకటించారు. ఈనెల 24వ తేదీ వరకు గడువుగా విధించారు. ఇక అపరాధ రుసుముతో ఫిబ్రవరి 21 వరకు ఫీజులను చెల్లించవచ్చన్నారు. విద్యార్థుల ఆర్థిక పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని 50 రోజుల పాటు ఫీజు చెల్లించుకునే అవకాశం ఇచ్చారు. గతేడాది అక్టోబర్లో నిర్వహించిన ఫస్టియర్ పరీక్షల్లో ఫేయిల్ అయిన వారు ఇప్రూవ్మెంట్ రాసుకోవచ్చని జలీల్ తెలిపారు.
ఈ ఏడాది కొత్తగా ప్రవేశపెట్టిన నాలుగేండ్ల బీఈడీ కోర్సుకు స్పందన భారీగానే ఉంది. తొలి ఏడాదే 89 శాతం సీట్లు నిండాయి. మొత్తంగా 166 సీట్లకు గాను 148 మంది విద్యార్థులకు సీట్లు కేటాయించినట్లు అధికారులు ప్రకటించారు. కేవలం 18 సీట్లు మాత్రమే మిగినట్లు పేర్కొన్నారు. ఒకే ఒక్క కాలేజీకి అనుమతి లభించగా, అధికారులు కౌన్సెలింగ్ ద్వారా సీట్లను భర్తీచేశారు.