ఖమ్మం, సెప్టెంబర్ 23(నమస్తే తెలంగాణ ప్రతినిధి): అటవీ సంరక్షణ, పునరుజ్జీవనానికి శా శ్వత పరిషారం కల్పించడంతోపాటు ఏండ్లుగా పోడుభూములు సాగుచేస్తూ, హకుపత్రాలు పొందని గిరిజన, గిరిజనేతరులకు న్యాయం చేసేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టిందని రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ పేర్కొన్నారు. శుక్రవారం ఖమ్మం కలెక్టరేట్లో పోడుభూముల సమస్య పరిషారానికి ఏర్పాటు చేసిన జిల్లాస్థాయి సమన్వయ కమిటీ సమావేశం జరిగింది. అటవీ భూముల ఆక్రమణలు కాకుం డా, వాటి పరిరక్షణకు ప్రభుత్వం కృషి చేస్తున్నదన్నారు. ఖమ్మం జిల్లాలో 10 మండలాల్లోని 94 పంచాయతీలు, 132 ఆవాసాల్లో పోడు భూముల సమస్య ఉన్నట్టు తెలిపారు. జిల్లాలో పోడు భూముల హకుల కోసం 18,295 దరఖాస్తులు వచ్చాయన్నారు.