తెలంగాణలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో మినిమం టైం స్కేల్ లో పనిచేస్తున్న 74 మంది లెక్చరర్లను రాష్ట్ర సర్కారు క్రమబద్ధీకరించింది. ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో జనరల్, ఒకేషనల్ కోర్సుల్లో మినిమం టైం స్కేల్ లో పనిచేస్తున్న అధ్యాపకులను జీవో నంబర్ 17 ద్వారా రెగ్యులర్ చేస్తూ ఎడ్యుకేషనల్ ప్రిన్సిపల్ సెక్రెటరీ వాకాటి కరుణ ఉత్తర్వులు జారీ చేశారు.
సర్వీస్ రెగ్యులర్ అయినవారిలో 22 మంది జనరల్ విభాగంలో పనిచేసే లెక్చరర్లు ఉండగా, 52 మంది ఒకేషనల్ స్ట్రీమ్లో పనిచేసేవారున్నారు. క్రమబద్ధీకరణ తేదీ వాళ్లు క్రమబద్ధీకరణ ఉత్తర్వులు పొందిన తేదీ నుంచి అమలు అవుతుందని స్పష్టం చేశారు.. కచ్చితంగా సంబంధించిన క్వాలిఫికేషన్ సర్టిఫికెట్లు ఉండాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.