హైదరాబాద్ సిటీబ్యూరో, నవంబర్ 9 (నమస్తే తెలంగాణ): 18 ఏండ్లు నిండిన వారంతా ఇకనుంచి ఏడాదిలో నాలుగుసార్లు ఓటు హక్కు నమోదు చేసుకోవచ్చని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి వికాస్రాజ్ తెలిపారు. ‘స్వీప్’ కార్యక్రమంలో భాగంగా బుధవారం ఉస్మానియా యూనివర్సిటీ ప్రాంగణంలోని ఆంధ్ర మహిళా సభ కళాశాలలో ఓటరు నమో దు, ఆధార్ అనుసంధానంపై అవగాహన కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించి మాట్లాడారు.
గతంలో ఏడాదికి ఒకసారి మాత్రమే ఓటు హక్కు నమోదుకు అవకాశం ఉండేదని, ఇక నుంచి ఏడాదిలో నాలుగుసార్లు నమోదు చేసుకొనే వెసులుబాటు ఉన్నదని అన్నారు. జనవరి 1, ఏప్రిల్ 1, జూలై 1, అక్టోబర్ 1 తేదీల్లోపు 18 ఏండ్లు నిండిన వారు తప్పనిసరిగా ఓటు హక్కు నమోదు చేసుకోవాలని కోరారు. ముసాయిదా ఓటరు జాబితా విడుదల చేసిన సందర్భంగా పోలింగ్ కేంద్రాల వద్ద జాబితాను ప్రదర్శిస్తామని, అభ్యంతరాలు ఉంటే డిసెంబర్ 8 వరకు స్వీకరిస్తామని చెప్పా రు. జీహెచ్ఎంసీ కమిషనర్ లోకేశ్కుమార్ మాట్లాడుతూ ఓటు నమోదుపై హైదరాబాద్ జిల్లాలోని 15 నియోజకవర్గాల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలిపారు. ఆఫ్లైన్లో లేదా www. nvsp.in వెబ్సైట్లో ఓటు నమోదు, ఓటర్-ఆధార్ అనుసంధానం చేసుకోవచ్చని పేర్కొన్నారు. ఈ కార్యక్రమం లో కళాశాల ప్రిన్సిపాల్ ఝాన్సీరాణి, జోనల్ కమిషనర్లు పాల్గొన్నారు.