హైదరాబాద్ : గల్ఫ్ కార్మికుల వేతనాలు తగ్గింపుపై కేంద్రం జీవో రద్దు చేయడం హర్షణీయమని టీఅర్ఎస్ ఎన్నారై సెల్ బహ్రైన్ ప్రెసిడెంట్ రాధారపు సతీష్ కుమార్ అన్నారు. గత సంవత్సరం సెప్టెంబర్లో కేంద్ర ప్రభుత్వం 30 నుంచి 50 శాతం గల్ఫ్ కార్మికుల వేతనాలు తగ్గిస్తూ రిఫరల్ వేజెస్ జీవోను జారీ చేసింది. కాగా, గల్ఫ్లో పనిచేసే మనదేశ కార్మికులకు నష్టం చేకూర్చే విధంగా గతేడాది తెచ్చిన జీవోను రద్దు చేస్తూ పాత జీవో ప్రకారమే వేతనాలు చెల్లించే విధంగా నిర్ణయం తీసుకోవడం చాలా సంతోషంగా ఉందన్నారు.
ఈ జీవోను వెనెక్కి తీసుకోవడంతో గల్ఫ్ లోని 88 లక్షల మంది భారతీయులకు ఊరట లభించిందన్నారు. గల్ఫ్ కార్మికుల సమస్యలపై మంత్రి కేటీఆర్, ఎమ్మెల్సీ కవిత వెంటనే స్పందించి కేంద్ర మంత్రులతో మాట్లాడి సమస్య పరిష్కారం అయ్యేలా చూశారు. అలాగే పార్లమెంట్లో టీఆర్ఎస్ ఎంపీలు గల్ఫ్ కార్మికుల తరఫున కొట్లాడారు. వారందరికి టీఆర్ఎస్ ఎన్నారై బహ్రైన్ పక్షాన కృతజ్ఞతలు తెలియజేస్తున్నామన్నారు.
ఇవి కూడా చదవండి..
ఛత్తీస్గఢ్ పోలీసులకు చిక్కిన టైగర్ హుంగా
పేదల కడుపు నింపేందుకే కొత్త రేషన్ కార్డులు
Tokyo Olympics: చరిత్ర సృష్టించిన 13 ఏళ్ల నిషియా
గంభీర్కు చుక్కెదురు.. స్టే ఇవ్వలేమన్న సుప్రీం