హైదరాబాద్, నవంబర్ 23 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలోని పంచాయతీరాజ్ ఇంజినీరింగ్ విభాగం పునర్వ్యవస్థీకరణను వేగిర పర్చాలని, అధికారాలను, బాధ్యతలను వికేంద్రీకరించి, పోస్టుల భర్తీకి ప్రతిపాదనలు సిద్ధం చేయాలని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అధికారులను ఆదేశించారు. బంజారాహిల్స్లోని మంత్రుల నివాస ప్రాంగణంలో బుధవారం పంచాయతీరాజ్ కార్యదర్శి రఘునందన్రావు, ఈ ఎన్సీ సంజీవరావు, ఇతర అధికారులతో సమీక్ష నిర్వహించా రు.
రాష్ట్రంలో అవసరమైన సిబ్బంది కో సం కొత్త పోస్టుల భర్తీకి సంబంధించి గురువారంలోగా నివేదిక ఇవ్వాలన్నారు. పంచాయతీరాజ్ రోడ్లపై జిల్లా లు, నియోజకవర్గాలవారీగా అత్యవసరమైన పనుల జాబితా రూపొందించాలని సూచించారు. డిసెంబర్ 10వ తేదీ నాటికి రోడ్ల మరమ్మతుల టెండర్లు పిలిచేందుకు సిద్ధం చేయాలని ఆదేశించారు. ఈ నెల 30లోపు పనుల మంజూరు తీసుకొని, డిసెంబర్ 15 నాటికి పనులు ప్రారంభించాలని సూచించారు.