కాశీబుగ్గ, నవంబర్ 16: వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్లో బుధవారం పత్తికి రికార్డు స్థాయి ధర పలికింది. ఈ సీజన్ అక్టోబర్ నుంచి అత్యధికంగా క్వింటాల్ పత్తికి రూ.9,015 ధర వచ్చింది. జనగామ జిల్లా జఫర్గడ్ మండలం హిమ్మత్నగర్కు చెందిన తరాల శోభన్బాబు 40 బస్తాల పత్తిని మార్కెట్కు తీసుకువచ్చాడు. తేమ శాతం 6.9 ఉండగా కల్యాణి ట్రేడర్స్ అడ్తి ద్వారా మహాలక్ష్మి ఎంటర్ప్రైజెస్ ఖరీదు వ్యాపారి క్వింటాల్కు రూ.9,015తో కొనుగోలు చేసినట్టు అధికారులు తెలిపారు. మధ్యరకం రూ.7,600, కనిష్ఠంగా రూ.6,200 పలికినట్టు వారు పేర్కొన్నారు.