యాదగిరిగుట్ట, జనవరి 4 : ప్రహ్లాదుడి మనో సంకల్పం పాలకుల ప్రత్యేక చొరవతో యాదగిరిగుట్ట ఆలయ పునర్నిర్మాణం మహాద్భుతంగా రూపుదిద్దుకున్నదని శ్రీమత్ అష్టాక్షరీ పీఠాధిపతి త్రిదండి అష్టాక్షరీ సంపత్కుమార రామానుజ జీయర్ స్వామి అన్నారు. గురువారం ఆయన యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి వారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ ప్రధానార్చకుడు నల్లన్థీఘళ్ లక్ష్మీనరసింహాచార్యులు ఆయనకు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. ముఖ మండపంలో భక్తులకు అనుగ్రహ భాషణం చేశారు.