హైదరాబాద్, మే 18 (నమస్తే తెలంగాణ): అంకితభావంతో ప్రజల కోసం అధికారులు పనిచేస్తేనే మంచి గుర్తింపు లభిస్తుందని గవర్నర్ శివ్ ప్రతాప్ శుక్లా తెలిపారు. సోమవారం ఎంసీఆర్హెచ్చార్డీలో శిక్షణ పొందుతున్న 44మంది గ్రూప్-1 ప్రొబేషనరీ డిప్యూటీ కలెక్టర్లు, సంస్థ ఎండీ శాంతికుమారి ఆధ్వర్యంలో గవర్నర్ను లోక్భవన్లో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా గవర్నర్ మాట్లాడుతూ ప్రతి నిర్ణయం ప్రజా సంక్షేమానికి ప్రాధాన్యత ఇచ్చేలా ఉండాలని సూచించారు.
సరస్వతి పుష్కరాలకు ఆహ్వానం
జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహాదేవపూర్ మండలంలోని కాళేశ్వరంలో ఈనెల 21 నుంచి ప్రారంభం కానున్న సరస్వతీ నది అంత్య పుష్కరాలకు హాజరు కావాలని గవర్నర్ శివ్ప్రతాప్ శుక్లాకు దేవాదాయశాఖ ఆహ్వానం పలికింది. ఈ మేరకు దేవాదాయశాఖ మంత్రి కొండా సురేఖ, ఆలయ అర్చకులు గవర్నర్ను లోక్భవన్లో కలిసి ఆహ్వాన పత్రికను అందజేశారు.
ఈపీసెట్ ర్యాంకర్ రుషికి అభినందన
తెలంగాణ ఈపీసెట్ ఫలితాల్లో రాష్ట్ర ప్రథమ ర్యాంకు సాధించిన విద్యార్థిని మల్లాడి రుషిని గవర్నర్ సోమవారం లోక్భవన్లో అభినందించారు. ఆమె కృషి, పట్టుదలతోపాటు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల సహకారం అభినందనీయమని పేర్కొన్నారు.