కొల్లాపూర్ రూరల్, సెప్టెంబర్ 27: పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు పంప్ను ఇరిగేషన్ అధికారులు తిరిగి రన్ చేశారు. ఈ నెల 16న పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల వద్ద సీఎం కేసీఆర్ వెట్న్న్రు ప్రారంభించిన విషయం తెలిసిందే. కొల్లాపూర్ సమీపంలోని నార్లాపూర్ ప్రాజెక్టు వద్ద 145 మెగావాట్ల సామర్థ్యం ఉన్న మోటర్తో 4 గంటలపాటు నీటిని ఎత్తిపోశారు. ఆ తర్వాత పంప్ను ఆఫ్ చేశారు. తాజాగా బుధవారం సాయంత్రం 5 గంటలకు అధికారులు తిరిగి మోటర్ను రన్ చేశారు. దీంతో కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతూ డెలివరీ సిస్టర్న్ నుంచి అంజనగిరి రిజర్వాయర్లోకి పరుగులు పెట్టింది. రిజర్వాయర్ సామర్థ్యం 1/3 ప్రకారం 2 టీఎంసీల నీటిని నిల్వ చేయనున్నట్టు పీఆర్ఎల్ఐ ఈఈ శ్రీనివాస్రెడ్డి తెలిపారు. నీటి పంపింగ్ షురూ కావడంతో కర్షకులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ప్రాజెక్టును సందర్శించేందుకు వివిధ జిల్లాల నుంచి రైతులు స్వచ్ఛందంగా తరలివస్తున్నారు. ప్రాజెక్టును పూర్తి చేసి సీఎం కేసీఆర్ తమ కష్టాలు తీర్చారని హర్షం వ్యక్తం చేస్తున్నారు.