వారికి జాతీయ ప్రాతినిధ్యం కల్పించిన ఘనత టీఆర్ఎస్దే
మంత్రి గంగుల కమలాకర్.. వద్దిరాజుకు శుభాకాంక్షలు
హైదరాబాద్, మే 18 (నమస్తే తెలంగాణ): ముఖ్యమంత్రి కేసీఆర్ మున్నూరుకాపుల పక్షపాతి అని బీసీ సంక్షేమశాఖ మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. టీఆర్ఎస్ రాజ్యసభ అభ్యర్థిగా మున్నూరుకాపు సామాజికవర్గానికి చెందిన వద్దిరాజు రవిచంద్రకు అవకాశం ఇవ్వడం సంతోషకరమని పేర్కొన్నారు. రవిచంద్రకు బుధవారం ఆయన శుభాకాంక్షలు తెలిపారు.
మున్నూరుకాపులకు జాతీయస్థాయిలో పనిచేసే అవకాశం కల్పించినందుకు సీఎంకు ధన్యవాదాలు తెలియజేశారు. సీఎం కేసీఆర్ సారథ్యంలో రాష్ట్రంలో వెనుకబడిన వర్గాలకు ప్రాధాన్యం దకుతున్నదని పేర్కొన్నారు. కేసీఆర్కు మున్నూరుకాపు జాతి ఎల్లప్పుడూ రుణపడి ఉంటుందని అన్నారు.