హైదరాబాద్, జూన్ 5 (నమస్తే తెలంగాణ): రాష్ట్రవ్యాప్తంగా రేషన్ డీలర్లు సమ్మెకు దిగారు. దీంతో రేషన్ దుకాణాలు మూతపడ్డాయి. ఈ నెల మూడో తేదీ నుంచి లబ్ధిదారులకు సరఫరా కావాల్సిన రేషన్ సరుకుల పంపిణీ నిలిచిపోయింది. రాష్ట్ర పౌరసరఫరాలశాఖ మంత్రి గంగుల కమలాకర్ గత నెల 22న సచివాలయంలో రేషన్ డీలర్లతో చర్చలు జరిపారు. వీలైనంత త్వరగా సమస్యలను పరిష్కరిస్తానని, పలు సమస్యలను సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్తానని వారికి హామీ ఇచ్చారు. దాంతో సమ్మె ఆలోచనను విరమిస్తున్నట్టుగా రేషన్ డీలర్లు ప్రకటించారు. కానీ, మళ్లీ 15 రోజుల్లోనే వారు సమ్మెకు దిగారు