గంగాధర, సెప్టెంబర్ 18 : కరీంనగర్ జిల్లా గంగాధరలోని రైల్వే బ్రిడ్జి మరమ్మతుకు నిధుల మంజూరులో బీజేపీ ఎంపీ బండి సంజయ్ విఫలమయ్యారని బీఎస్పీ జిల్లా అధ్యక్షుడు నిషాని రాంచంద్రం విమర్శించారు. శిథిలావస్థకు చేరిన రైల్వే బ్రిడ్జి వద్ద శనివారం బీఎస్పీ ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. అనంతరం రాంచంద్రం మాట్లాడుతూ.. కరీంనగర్ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తానని ఓట్లేయించుకొన్న బండి సంజయ్, గెలువగానే మత విద్వేషాలు రెచ్చగొడుతూ పబ్బంగడుపుతున్నాడని మండిపడ్డారు. ఆయనకు దమ్ముంటే కేంద్ర రైల్వేశాఖ మంత్రితో మాట్లాడి బ్రిడ్జి మరమ్మతుకు నిధులు మంజూరు చేయించాలని డిమాండ్ చేశారు.