హైదరాబాద్, జనవరి 19 (నమస్తే తెలంగాణ): రాష్ర్టానికి చెందిన విద్యార్థిని పెండ్యాల లక్ష్మీప్రియ రాష్ట్రీయ బాల పురస్కార్ అవార్డుకు ఎంపికైంది. కూచిపూడి నృత్యంలో విశేష ప్రతిభకనబరిచిన లక్ష్మీప్రియకు ప్రతిష్ఠాత్మక ప్రధానమంత్రి రాష్ట్రీయ బాల పురస్కార్-24 అవార్డు వరించింది. వరంగల్కు చెందిన 14 ఏండ్ల లక్ష్మీప్రియకు ఆర్ట్ అండ్ కల్చర్ విభాగంలో ఈ అవార్డు దక్కింది. లక్ష్మీప్రియ జాతీయ, రాష్ట్రస్థాయి అనేక పోటీల్లో విజేతగా నిలిచింది.