హైదరాబాద్ సిటీబ్యూరో, జనవరి 3(నమస్తే తెలంగాణ): అరుదైన వన్యప్రాణులతో ఏర్పాటుచేసిన ఎక్జాటిక్ యానిమల్ ఎగ్జిబిషన్కు అటవీశాఖ అధికారులు చెక్ పెట్టారు. హైదరాబాద్ కేపీహెచ్బీ 9 ఫేజ్కు చెందిన భరత్రెడ్డి కొంతకాలంగా అరుదైన జాతులకు చెందిన ఇగునా, తొండ, పైథాన్, చేపలు, పాములు, ముండ్ల పందులు, ఉష్ట్రపక్షులతో ఎలాంటి అనుమతి లేకుండా ప్రత్యేక ఎగ్జిబిషన్ నిర్వహిస్తున్నాడు. జంతు ప్రేమికుల ఫిర్యాదుల మేరకు ఎగ్జిబిషన్పై అటవీ అధికారులు దాడి చేసి, వన్యప్రాణులను రక్షించి సంరక్షణ కేంద్రానికి తరలించారు. నిర్వాహకుడిపై రూ.2 లక్షల జరిమానా విధించినట్టు మల్కాజిగిరి జిల్లా అటవీ శాఖాధికారి జానకీరాం వెల్లడించారు. అరుదైన వన్యప్రాణులను పెంచుకోవడం కూడా నేరమని, ప్రత్యేక అనుమతులు ఉంటేనే వీటిని పెంచుకోవాలని పేర్కొన్నారు.