Nagarjuna Sagar | హైదరాబాద్, ఫిబ్రవరి 23 (నమస్తే తెలంగాణ): ప్రపంచ పర్యాటక కేంద్రమైన నాగార్జునసాగర్ జలాశయంలో నీటి కుకలు సందడి చేస్తున్నాయి. ఉభయచర జీవుల్లో ఇవి కూడా ఒకటి. అరుదైన ఈ నీటికుకలు సాధారణంగా సముద్రతీర ప్రాంతాల్లో కనిపిస్తుంటాయి. తాజాగా నల్లగొండ జిల్లా నాగార్జునసాగర్ రిజర్వాయర్లో సందడి చేస్తూ కనిపించాయి. శివాలయం వీఐపీ పుషర ఘాట్ వద్ద ఈ వాటర్ డాగ్స్ కలియ తిరుగుతూ వీక్షకులకు కనువిందు చేస్తున్నాయి.
సందర్శకులు పెద్ద ఎత్తున వాటి వద్ద ఫొటోలు దిగుతూ, వాటిని వీడియోల్లో బంధిస్తూ సందడి చేస్తున్నారు. రెండేండ్ల క్రితం ఇదే సాగర్ జలాల్లో అటవీ శాఖ అధికారులు కొన్నింటిని గుర్తించారు. ఆ తర్వాత కనిపించకుండా పోయి, తాజాగా మళ్లీ గతంలో కంటే అధిక సంఖ్యలో దర్శనమివ్వడం విశేషం. ఈ జీవులు నీటిలో ఉండే చేపలను ఆహారంగా తీసుకుంటాయని జంతు శాస్త్రవేత్తలు చెబుతున్నారు.