మాదాపూర్, డిసెంబర్ 30: పుట్టిన 12 గంటలకే గుండె, ఊపిరితిత్తుల్లో సమస్యలు వచ్చిన శిశువుకు అరుదైన శస్త్రచికిత్స చేసి ప్రాణం పోశారు కిమ్స్ వైద్యులు. మహారాష్ట్రలోని నాందేడ్కు చెందిన దంపతులకు మగ శిశువు జన్మించాడు. పుట్టిన 12 గంటలకే శిశువు శ్వాసకోశ సమస్యలు, గుండె లోపాలతో ఇబ్బంది పడ్డాడు.
దీంతో వెంటనే అతడిని కొండాపూర్లోని కిమ్స్ దవాఖానకు తీసుకొచ్చారు. వైద్య పరీక్షలు చేసిన పిల్లల వైద్య నిపుణుడు డాక్టర్ సుదీప్ వర్మ.. బాలుడికి బృహద్ధమని సరైన చోట లేదని గుర్తించారు. మెకానికల్ వెంటిలేటర్పై ఉంచి, 12 గంటల పాటు ఆర్టీరియల్ స్విచ్ శస్త్రచికిత్స చేశామని చీఫ్ నియోనాటాలజిస్టు డాక్టర్ సీ అపర్ణ తెలిపారు. వీఎస్డీ రంధ్రాన్ని కూడా పూడ్చామని వివరించారు. కిమ్స్ వైద్య బృందం విజయవంతంగా సర్జరీ చేసిందని పేర్కొన్నారు.