నాగర్ కర్నూల్: నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ దవాఖానలో మైనర్ బాలికపై లైంగికదాడియత్నం కలకలం రేపుతున్నది. దవాఖానలో చికిత్స పొందుతున్న తల్లికి తోడుగా వచ్చిన 11 ఏండ్ల బాలికపై ఉత్తరప్రదేశ్కు చెందిన నీరజ్ (21) అనే యువకుడు లైంగికదాడికి ప్రయత్నించాడు. గమనించిన కుటుంబ సభ్యులు తెల్లవారుజామున 3 గంటల ప్రాంతంలో పోలీసులకు సమాచారం అందించారు.
దీంతో దవాఖానకు చేరుకున్న పోలీసులు నీరజ్ను అదుపులోకి తీసుకున్నారు. బాలిక కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు నీరజ్పై దిశ, నిర్భయ, ఫోక్సో చట్టాల కింద కేసు నమోదు చేసినట్లు తెలిపారు. హాస్పిటల్లో పెయింటింగ్ పనులు చేసేందుకు నీరజ్ కూలీగా వచ్చినట్లు పోలీసులు వెల్లడించారు.