హైదరాబాద్ : ఎంసెట్ ఫలితాల్లో బీసీ గురుకుల విద్యార్థులకు ర్యాంకులు రావడం పట్ల రాష్ట్ర బీసీ సంక్షేమం, పౌరసరఫరాల శాఖల మంత్రి గంగుల కమలాకర్ (Minister Gangula) సంతోషం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ర్యాంకర్లకు అభినందనలు తెలిపారు.
10వేల లోపు ర్యాంకులు సాధించిన వారిలో బీసీ గురుకులానికి (BC Residential College) చెందిన 26 మంది ఉన్నారని తెలిపారు. వీరిలో 20మంది అగ్రికల్చర్ (Agriculture) విభాగంలో , ఆరుగురు ఇంజనీరింగ్ (Engineering) విభాగంలో ర్యాంకులు (Ranks) సాధించారని పేర్కొన్నారు. మొత్తం 2106 మంది విద్యార్థులు ఎంసెట్లో అర్హత సాధించారని వెల్లడించారు.
తెలంగాణ ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు (Chief Minister) నేతృత్వంలో ఏర్పడ్డ గురుకుల కళాశాలల్లో అందిస్తున్న ఉన్నత ప్రమాణాల విద్య ఫలితంగా విద్యార్థులు ఈ ర్యాంక్ లు సాధించారని కొనియాడారు. మంత్రితో పాటు బీసీ సంక్షేమ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ బుర్రా వెంకటేశం, కార్యదర్శి మల్లయ్యబట్టు ర్యాంకర్లకు అభినందనలు తెలిపిన వారిలో ఉన్నారు.