హైదరాబాద్, సెప్టెంబర్ 17 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర ఎన్నికల కమిషనర్గా రిటైర్డ్ ఐఏఎస్ అధికారిని రాణికుముదినిని ప్రభుత్వం నియమించింది. ఆమె బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి మూడేండ్ల పాటు పదవిలో కొనసాగుతారు. ఇప్పటివరకు కమిషనర్గా ఉన్న పార్థసారథి పదవీకాలం ముగియడంతో ఆయన స్థానంలో రాణికుముదినిని ప్రభుత్వం నియమించింది. 1988 ఐఏఎస్ బ్యాచ్కు చెందిన రాణికుముదిని ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా కార్మికశాఖలో పనిచేసి గతేడాది జూన్లో పదవీవిరమణ చేశారు. ఆమె గతంలో రంగారెడ్డి జిల్లా కలెక్టర్గానే కాకుండా వివిధ శాఖల్లో బాధ్యతలు నిర్వర్తించారు. కేంద్ర వ్యవసాయ శాఖలోనూ ఆమె పనిచేశారు.