నిర్మల్ అర్బన్/శంషాబాద్ రూరల్, జనవరి 23: ఇండ్లకు నంబర్లు కేటాయించేందుకు లం చం తీసుకుంటూ మంగళవారం మున్సిపల్, పంచాయతీ అధికారులు ఏసీబీకి పట్టుబడ్డారు. నిర్మల్ పట్టణంలోని ఏఎన్ రెడ్డి కాలనీకి చెం దిన గోపాల్రెడ్డి 2023 జనవరిలో కట్టుకు న్న ఇంటికి నంబర్ కోసం బిల్ కలెక్టర్ నవంత్, రె వెన్యూ అధికారి గంగాధర్ 10 వేలు లంచం ఇవ్వాలని డిమాండ్ చేశారు. 3,500ను మంగళవారం ఇస్తుండగా వారిని ఏసీబీ అధికారులు రెడ్హ్యాండెడ్గా పట్టుకొనికోర్టుకు తరలించారు.
రంగారెడ్డి జిల్లాలో కార్యదర్శి, బిల్కలెక్టర్..
రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలం నర్కూడ గ్రామ పంచాయతీ పరిధిలోని అమ్మపల్లి రెవెన్యూ పరిధిలో విద్యుత్తు శాఖ ఏఈ మధు కుటుంబ సభ్యులకు ప్లాట్లు ఉన్నాయి. వాటిలో నిర్మాణాలు చేసి ఇంటి నంబర్ల కోసం స్థానిక పంచాయతీ కార్యదర్శి లక్ష్మీనర్సిహకు దరఖాస్తు చేసుకున్నారు. ఆయన సూచన మేరకు ఏఈ బిల్కలెక్టర్ నాగరాజును కలిస్తే 60 వేలు లంచం డి మాండ్ చేశాడు. మంగళవారం బాధితుడు మధు నర్కూడ కార్యదర్శి, బిల్ కలెక్టర్ నాగరాజుకు 45 వేలు లంచం ఇస్తుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు.