భద్రాచలం, ఫిబ్రవరి 16: తెలంగాణ రాష్ట్ర గాయత్రీ బ్రాహ్మణ సేవా సంఘం జాతీయ ప్రధాన కార్యదర్శి రామావఝల రవికుమార్ను తెలంగాణ రాష్ట్ర కమిటీ అధ్యక్షుడిగా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసినట్టు ఆ సంఘం వ్యవస్థాపక అధ్యక్షుడు గర్నెపూడి శ్రీరామ్శర్మ బుధవారం భద్రాచలంలో తెలిపారు. రాష్ట్ర కమిటీ కార్యదర్శులుగా కేవీఎస్ శర్మ, చంద్రశేఖర్ శర్మ, ప్రచార కార్యదర్శిగా బుక్కపట్నం రామాచార్యులకు బాధ్యతలు అప్పగించినట్టు ఆయన పేర్కొన్నారు. తెలంగాణలోని అన్ని జిల్లాల్లో గాయత్రీ బ్రాహ్మణ సేవా సంఘం శాఖలను ఏర్పాటు చేసేందుకు వీరిని నియమించినట్టు ఆయన తెలిపారు.