ములుగు : ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన రామప్ప ఆలయం మూడు వర్ణాల్లో దర్శనమిస్తూ కనువిందు చేస్తున్నది. జిల్లాలోని వెంకటాపూర్ మండలంలో గల రామప్ప దేవాలయం త్రివర్ణ శోభితమైంది. దేశంలో 100 కోట్ల మందికి వ్యాక్సిన్ పూర్తయిన సందర్భంగా గురువారం కేంద్ర పురావస్తు శాఖ అధికారులు రామప్ప ఆలయాన్ని విద్యుత్ దీపాలతో అలంకరించారు.
విద్యుత్ కాంతుల్లో మూడు రంగుల్లో వెలుగులు విరజిమ్ముతున్న రామప్ప ఆలయం పర్యాటకులను మంత్రముగ్ధులను చేసింది. పర్యాటకులు ఆలయం వద్ద సెల్ఫీలు దిగుతూ సందడి చేశారు.
ఇవి కూడా చదవండి..
Crime news | పండుగ పూట విషాదం..చెరువులో పడి తల్లీకూతుళ్లు మృతి
Crime news | రైతు బంధు చెక్కుల దుర్వినియోగంలో 23 మంది అరెస్ట్
కేంద్ర ప్రభుత్వం అసమర్థత వల్లే కరెంట్ సంక్షోభం : మంత్రి నిరంజన్ రెడ్డి