ములుగు జిల్లా వెంకటాపూర్ మండలం పాలంపేటలోని ప్రపంచ వారసత్వ కట్టడమైన రామప్ప ఆలయంలో అద్భుతం చోటుచేసుకున్నది. ఆదివారం సూర్యోదయాన శివలింగంపై సూర్యకిరణాలు ప్రసరించాయి. అభిషేకానంతరం అలంకరిస్తున్న సమయంలో సూర్యకిరణాలుశివుడిని తాకాయని అర్చకులు తెలిపారు.
అభిషేకానికి వచ్చిన భక్తులు ఈ దృశ్యాన్ని చూసి అనుభూతికి లోనయ్యారు. కాగా 2021 సెప్టెంబర్ 8, 9వ తేదీల్లో, 2022 జూలై 22న ఇలాగేసూర్యకిరణాలు ప్రసరించినట్టు అర్చకులు పేర్కొన్నారు.
– వెంకటాపూర్