హైదరాబాద్: నగర శివార్లలోని ముచ్చింతల్ శ్రీరామనగరంలో జరుగుతున్న సమతామూర్తి రామానుజాచార్య (Ramanujacharya) సహస్రాబ్ది ఉత్సవాలు నేటితో ముగియనున్నాయి. ఈనెల 2న ప్రారంభమైన వేడుకలు 11 రోజులపాటు వైభవంగా జరిగాయి. ఉత్సవాల్లో చివరి రోజైనా సోమవారం మహాపూర్ణాహుతి జరుగనుంది. ఉదయం 9.30 గంటలకు సహస్ర కుండలాల యజ్ఞానికి మహాపూర్ణాహుతి పలుకునున్నారు. ఈ కార్యక్రమానికి సీఎం కేసీఆర్ హాజరుకానున్నారు.
అనంతరం ఉయంద 11.30 గంటలకు సమతామూర్తి బంగారువిగ్రహానికి ప్రాణప్రతిష్ఠాపనచేస్తారు. సాయంత్రం 5 గంటల నుంచి 8 గంటల వరకు 108 ఆలయాల్లో దేవతామూర్తుల కల్యాణోత్సవాలు నిర్వహించనున్నారు. కాగా, నేటి నుంచి సాధారణ భక్తులకు దర్శనానికి అనుమతించనున్నారు.