కేపీహెచ్బీ కాలనీ, జనవరి 31: గంగానది పుష్కరాలు, చార్ధామ్ యాత్రకు వెళ్లే వారికి ప్రత్యేక రాయితీని కల్పించినట్టు ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్స్ సంస్థ అధినేత రమణ తెలిపారు. మంగళవారం కూకట్పల్లిలోని తన కార్యాలయంలో యాత్ర, పర్యాటక ప్రత్యేక ప్యాకేజీల వాల్పోస్టర్లను ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రానున్న వేసవి కాలాన్ని దృష్టిలో పెట్టుకుని ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్స్ నిర్వహిస్తున్న ‘ట్రావెల్స్ ఎక్స్పో-2023’ని ఫిబ్రవరి 28 వరకు పొడిగిస్తున్నట్టు తెలిపారు. దీనిలో భాగంగా గంగానది పుష్కరాలు, చార్ధామ్ యాత్రకు ప్రత్యేక ఆఫర్లు ఉన్నాయని చెప్పారు.
అలాగే థాయ్ లాండ్లోని ప్రముఖ ఎయిర్లైన్ సంస్థ హైదరాబాద్కు డైరెక్ట్గా విమాన సదు పాయాన్ని కల్పించడంతో కేవలం రూ.31,999కే బ్యాంకాక్ టూర్కు వెళ్లొచ్చని పేర్కొన్నారు. అమర్నాథ్ యాత్ర, మానస సరోవరం, సిమ్లా, మనాలి, కర్ణాటక, కాశీ, గయా, ప్రయాగ, గుజరాత్, కశ్మీర్, శ్రీనగర్, బ్యాంకాక్, పట్టాయ, గాంగ్టక్, డార్జిలింగ్, సింగపూర్, మలేషియా, దుబాయ్, బాకు, అల్మాటి యాత్రలకు భారీ రాయితీలు కల్పిస్తున్నట్టు వివరించారు. ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్స్ కల్పిస్తున్న ఈ రాయితీ అవకాశాన్ని పర్యాటకులు వినియోగించుకోవాలని కోరారు. మరిన్ని వివరాలకు 7032666921ను సంప్రదించాలని సూచించారు.